'ఇంటర్, 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి'
VZM: ఇంటర్మీడియట్, 10వ తరగతి పరీక్షలు అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఎక్కడా కాపీయింగ్ జరగకుండా చూడాలని, అన్ని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జిల్లా కలెక్టర్లు తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇంటర్,10 వ తరగతి పరీక్షలు పై పలు సూచనలు జారీ చేశారు.