వేట్లపాలెం పేలుడు ఘటనలో మరో ప్రాణం బలి

వేట్లపాలెం పేలుడు ఘటనలో మరో ప్రాణం బలి

KKD: వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి కాకినాడ GGHలో చికిత్స పొందుతున్న ఎం.శ్రీను (30) గురువారం మృతి చెందాడు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 27కు చేరుకుంది. ఆసుపత్రికి వచ్చిన తొమ్మిది మందిలో ఏడుగురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మరో ఇద్దరు క్షతగాత్రులు ప్రస్తుతం GGHలో చికిత్స పొందుతున్నారు.