VIDEO: మచిలీపట్నంలో కూల్చివేతల ఉద్రిక్తత
కృష్ణా: మచిలీపట్నం సర్కార్ తోట 6వ డివిజన్లో అనుమతి లేకుండా జరుగుతున్న గృహ నిర్మాణాన్ని గుర్తించిన కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. గురువారం ఉదయం భారీ పోలీస్ బందోబస్తు మధ్య చర్యలు కొనసాగించగా, వైసీపీ ఇంఛార్జ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులతో పాటు పేర్ని కిట్టు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది.