రేపే పెన్షన్ పంపిణీ: ఎంపీడీవో
CTR: పెనుమూరు మండలానికి మార్చికి గాను రూ. 2.97 కోట్ల పెన్షన్ నగదు మంజూరైనట్లు ఎంపీడీవో నీలకంఠేశ్వర్ రెడ్డి తెలిపారు. మండలంలోని 14 గ్రామ సచివాలయ పరిధిలో అర్హులైన 7,060 వేల మంది లబ్ధిదారులకు పెన్షన్లను అందజేస్తామన్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది శనివారం ఉదయం 7 గంటల నుంచి ప్రతి గడపకు వెళ్లి లబ్ధిదారులకు నగదును అందజేసేలా ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.