శ్రీవారిని దర్శించుకున్న మంత్రి
TPT: సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 లక్షల గృహాలకు గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆ గృహవాసులందరినీ భగవంతుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు.