కొత్త జిల్లాల ఏర్పాటుపై CPM హర్షం
AP: రాష్ట్రంలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీనిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పడే పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గంలోని ఆదివాసీ ప్రాంతాలను కూడా కలిపితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.