మెస్సీ, సీఎం మ్యాచ్.. ఏర్పాట్లు పూర్తి
TG: ఉప్పల్ స్టేడియంలో ఇవాళ రాత్రి 7 గంటలకు లియోనాల్ మెస్సీ, సీఎం రేవంత్ ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్లో తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ CP సజ్జనార్ తెలిపారు. 2500 మంది పోలీసులతో భద్రత కల్పించినట్లు చెప్పారు. కేవలం టికెట్లు ఉన్నవారు మాత్రమే మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియానికి రావాలని సూచించారు.