శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుండగా.. 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72860 మంది దర్శించుకోగా.. 31,612 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.98 కోట్లు వచ్చినట్లు TTD అధికారులు తెలిపారు.