రన్నరప్గా నిలిచిన ఎమ్మెల్యే బండారు శ్రావణి
ATP: షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఎమ్మెల్సీ గ్రీష్మ పోటాపోటీగా తలపడ్డారు. అత్యంత ఉత్సాహంగా సాగిన ఈ మ్యాచ్లో ఎమ్మెల్సీ గ్రీష్మ విజేతగా నిలవగా, ఎమ్మెల్యే శ్రావణి రన్నరప్గా నిలిచారు. ప్రజా ప్రతినిధులు ఇద్దరూ క్రీడా స్ఫూర్తిని చాటుతూ మైదానంలో చురుగ్గా ఆడటం అందరినీ ఆకట్టుకుంది.