చింతలపల్లి గ్రామ సర్పంచ్గా సురేష్ విజయం
MNCL: జన్నారం మండలంలోని చింతలపల్లి గ్రామ సర్పంచ్గా పంజాల సురేష్ గెలుపొందారు. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా గురువారం గ్రామంలో ఎన్నికల జరిగాయి. అనంతరం ఓట్ల కౌంటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పంజాల సురేష్ తమ సమీప ప్రత్యర్థిపై 431 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు తనను సర్పంచ్గా గెలిపించడం సంతోషంగా ఉందన్నారు.