భవానీపురానికి చేరుకున్న మాజీ సీఎం జగన్
NTR: విజయవాడ భవానీపురానికి మాజీ సీఎం జగన్ చేరుకున్నారు. బాధితులకు కలిసి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఇటీవల జోజినగర్లో 42 ఫాట్లను అధికారులు కూల్చివేశారు. కొంతకాలంగా జోజినగర్లో ఉన్న 2.17 ఎకరాల స్థలం వివాదంలో ఉంది. ఆ స్థలం లక్ష్మీరామ బిల్డింగ్ సొసైటీ తమదే అంటున్నారు. దీనిపై కూడా జగన్ విచారించనున్నారు. కూల్చివేతలను పరిశీలించిన తర్వాత బాధితుల్ని పరామర్శించనున్నారు.