ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక
NLR: ఇంటర్ పరీక్ష ఫలితాలకు సంబంధించి రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవాలని ఆర్ఎవో వరప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు రీకౌంటింగ్కు ఒక పరీక్షా పత్రానికి రూ.260, రీ వెరిఫికేషన్కు రూ.1300 రుసుము చెల్లించాలన్నారు. ఈనెల 27 తేదీ లోపు అప్లై చేసుకోవచ్చని.. ఎలాంటి సందేహాలు ఉన్నా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.