విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి.!
KRNL: ఆలూరు(మం) అరికేరలో విద్యుత్ షాక్తో కటికే వలి(45) మృతి చెందాడు. ఇంటి గోడకు నీళ్లు కొట్టేందుకు మోటార్కు కనెక్షన్ ఇస్తుండగా దురదృష్టవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనల మధ్య ఇవాళ అంత్యక్రియలు నిర్వహించారు.