దాడి ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు
KRNL: పెద్దకడబూరు మండలం చిన్నతుంభళం గ్రామంలో ఇంటి స్థలం దారి విషయంలో జరిగిన వివాదం ఇవాళ దాడికి దారితీసింది. గ్రామానికి చెందిన బోయ హనుమంతు, కడబూరి హరికృష్ణలపై అదే గ్రామానికి చెందిన లింగన్న, మహదేవ, మహేష్లు దాడిచేసి గాయపరిచినట్లు బాధితుడు బోయ హనుమంతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నిరంజన్ రెడ్డి తెలిపారు.