మంత్రి లోకేష్ని కలిసిన ఎమ్మెల్సీ
TPT: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు సందర్భంగా సోమవారం రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి, మంత్రి నారా లోకేశ్ను అసెంబ్లీ ఆవరణంలో ఆయన ఛాంబరులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే టీడీపీలో చేరిన ఎమ్మెల్సీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు అంశాలను ఎమ్మెల్సీ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు.