'ఈనెల 18న ముదిగుబ్బలో గ్రీవెన్స్ డే'
సత్యసాయి: ముదిగుబ్బ మండలం ఎమ్మార్వో కార్యాలయంలో ఈనెల 18న ఆర్డీవో మహేష్ గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు ఇంఛార్జ్ ఎమ్మార్వో మునిస్వామి తెలిపారు. మండలంలోని అన్నిశాఖల అధికారులు పాల్గొని, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే ఈ కార్యక్రమానికి విచ్చేసి వినతులు సమర్పించాలని కోరారు.