మరోసారి కాల్పులు.. ఐదుగురికి గాయాలు

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. కనెక్టికట్లోని ఓ మాల్లోకి అకస్మాతుగా వచ్చి దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం దుండుగుడి కోసం గాలిస్తున్నారు. కాగా, నిన్న ఫిలడెల్పియాలో జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.. 8 మంది గాయపడ్డారు.