ట్రాన్స్‌ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్

ట్రాన్స్‌ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్

TPT: తిరుపతి జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు సంవత్సరాలుగా 59 ట్రాన్స్‌ఫార్మర్‌లను ధ్వంసం చేసి రాగి వైర్లు దొంగిలించిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 2.72 లక్షల విలువ గల రాగి వైర్లు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.