కాంతార అరుపు.. రణ్వీర్పై ఫ్యాన్స్ ఫైర్!
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కొత్త వివాదంలో ఇరుక్కున్నాడు. గోవా IFFI వేడుకలో 'కాంతార' సినిమాలోని దైవం అరుపును స్టేజ్పై మిమిక్రీ చేశాడు. ఇది చూసి అక్కడే ఉన్న రిషబ్ శెట్టి అసౌకర్యంగా ఫీలయ్యాడు. దీనిపై కన్నడ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. పవిత్రమైన దైవాన్ని అవమానిస్తారా.. క్షమాపణ చెప్పకపోతే తన 'దురంధర్' సినిమాను బ్యాన్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు.