రేవేంద్రపాడు వద్ద ప్రమాదం.. యువకుడి మృతి

రేవేంద్రపాడు వద్ద ప్రమాదం.. యువకుడి మృతి

GNTR: దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. తెనాలి-విజయవాడ రహదారిపై రేవేంద్రపాడు నుంచి బైక్‌పై వస్తున్న యువకుడిని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ నుజ్జునుజ్జు కాగా, యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నూతక్కి ప్రాంతానికి చెందినవాడని పోలీసులు గుర్తించారు.