లబ్ధిదారుల గుర్తింపుకు మత్స్య శాఖ సర్వే

లబ్ధిదారుల గుర్తింపుకు మత్స్య శాఖ సర్వే

AKP: మత్స్యకార భరోసా పథకం కింద లబ్ధిదారుల గుర్తింపుకు గురువారం నక్కపల్లి మండలం రాజయ్యపేట, బోయపాడు మత్స్యకార గ్రామాల్లో మత్స్య శాఖ ఆధ్వర్యంలో అధికారులు సర్వే ప్రారంభించారు. ఏప్రిల్ 15 నుంచి‌ జూన్ 15వ తేదీ వరకు సముద్రంలో ‌ వేట నిషేధ సమయంలో ‌ మత్స్యకారులకు ప్రభుత్వం సహాయం అందిస్తుందన్నారు. ఈ సహాయానికి అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు.