వాయు లింగేశ్వరున్ని దర్శించుకున్న ప్రిన్సిపల్ సెక్రెటరీ

TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ విచ్చేశారు. ఆయనకు ఆలయ ఈవో బాపిరెడ్డి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు కల్పించారు. అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి స్వామి, అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆలయంలో క్యూలైన్లు, భక్తులతో ముఖాముఖి, ప్రసాదం పోటు పరిశీలించారు.