పోచమ్మ ఆలయంలో దాడి ఘటనలో కేసు నమోదు

పోచమ్మ ఆలయంలో దాడి ఘటనలో కేసు నమోదు

ఆసిఫాబాద్ మండలం కసాబ్వాడి పోచమ్మ ఆలయాన్ని శుభ్రం చేస్తున్న తక్కల్ల జయశ్రీపై మరో మహిళ (జయశ్రీ) దాడికి పాల్పడింది. అసభ్య పదజాలంతో దూషించి, చీపురుతో కొట్టడమే కాకుండా అక్కడే ఉన్న పవన్, శిరీషలను కులం పేరుతో అవమానపరిచినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు.