బ్రెయిన్ స్ట్రోక్ బాధితుడికి ఎమ్మెల్యే పరామర్శ
NLG: పట్టణంలోని ఐకాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోడిరెక్క శౌరి ని ఇవాళ మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పరామర్శించారు. బ్రెయిన్ స్ట్రోక్తో శౌరి ఆసుపత్రిలో చేరారని తెలియడంతో ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శౌరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.