కేంద్ర సహకారంతోనే అభివృద్ధి: కొండపల్లి
AP: చంద్రబాబు మరోసారి సీఎం అయితేనే రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా నెలివాడలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ఐక్యంగా ఉంటేనే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. YCP అరాచకాలను ఎదిరించిన జనసైనికులను కలుపుకుని వెళ్లాలని TDP శ్రేణులకు సూచించారు. కేంద్ర సహకారంతోనే అభివృద్ధి జరుగుతోందన్నారు.