క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

PPM: నీలకంఠాపురం మండలంలోని పనసబద్ర గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను నీలకంఠాపురం ఎస్సై నీలకంఠారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్విన్‌పేట సీఐ హరి బాబు, పోలీసు సిబ్బందితో కలిసి టోర్నమెంట్ నిర్వాహకులకు క్రికెట్ బ్యాట్, వికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు.