ఆదోని బైపాస్ బ్రిడ్జిపై లారీలో మంటలు

ఆదోని బైపాస్ బ్రిడ్జిపై లారీలో మంటలు

KRNL: ఆదోని- ఆస్పరి రహదారిలోని నూతన బైపాస్ బ్రిడ్జిపై ఇవాళ ఓ లారీలో మంటలు చెలరేగాయి. బ్యాటరీ మరమ్మతు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. మంటల ధాటికి అటుగా వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.