పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి గడ్డి అన్నారం కార్పొరేటర్

HYD: నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని బుధవారం గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని శారదా నగర్లో డ్రైనేజీ లైన్ పనులను పరిశీలించారు. రూ. 2 లక్షలతో మరమ్మత్తులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇటీవల భారీ వాహనాలు వెళ్లడంతో డ్రైనేజీ ధ్వంసం అయిందని, దీంతో మరమ్మతులు చేపడుతున్నామని వెల్లడించారు.