మణికొండలో వలస కార్మికుడు మృతి
హైదరాబాద్లోని మణికొండలో ఓ కార్మికుడు ఇవాళ అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి ఓ కార్మికుడు కాలు జారీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడు బిహార్కు చెందిన వలస కార్మికుడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.