'వైసీపీ నాయకులు ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది'

VZM: గడచిన పది నెలలకు ముందు వైసీపీ చేయని పనులను కూడా ఇప్పుడు ఆ నాయకులు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రబీ సీజన్కు సంబంధించి ఇంకా ధాన్యం కొనుగోలు జరగడం లేదంటున్నారని గత నాలుగైదు సంవత్సరాల్లో రబీలో ఎక్కడైనా ప్రాక్యూర్మెంట్ జరిగిందా అని ప్రశ్నించారు.