నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

కృష్ణా: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని గురువారం నిర్వహించనున్నట్టు జడ్పీ సీఈఓ కన్నమ్మ నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11గంటలకు మచిలీపట్నం జడ్పీ కన్వెన్షన్ హాలులో జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన సమావేశం ప్రారంభమవుతుందన్నారు. అంతకముందు 10 గంటలకు జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను నిర్వహించనున్నట్టు తెలిపారు.