మాజీ సర్పంచ్లకు ఘన సన్మానం
PLD: వినుకొండలో మాజీ సర్పంచ్లను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సన్మానించారు. పదవీకాలం ముగిసిన వారిని బుధవారం ఆయన దుశ్శాలువాలతో సత్కరించారు. గ్రామాభివృద్ధిలో సర్పంచ్లది కీలక పాత్ర అని ఆయన కొనియాడారు. గత ఐదేళ్లు వారు చేసిన సేవలు ఎంతో అభినందనీయమన్నారు. పదవులు ముగిసినా భవిష్యత్తులోనూ ప్రజా సేవలో కొనసాగాలని ఆయన సూచించారు.