గ్యాస్ కొరతపై ప్రజల ఆందోళన

గ్యాస్ కొరతపై ప్రజల ఆందోళన

BDK: భద్రాచలంలో వంట గ్యాస్ కొరతతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. సిలిండర్లు బుక్ చేసి 20 రోజులు గడిచినా సరఫరా లేక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గృహ వినియోగదారులను పట్టించుకోకుండా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలకు మాత్రం సరఫరా జరుగుతోందని ఆరోపిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల సమాధానాలు కూడా స్పష్టంగా లేకపోవడంతో వినియోగదారుల్లో అసహనం పెరుగుతోంది.