పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం

పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం

ATP: జిల్లాలోని గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. ఈ మేరకు కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 577 పంచాయతీలకు గాను, ఇప్పటికే ఎన్నికలు జరగని రెండు చోట్ల పాత పాలనే సాగుతోంది. మిగిలిన 575 పంచాయతీలకు కొత్తగా అధికారులను నియమించినట్లు డీపీఓ నాగరాజు నాయుడు వెల్లడించారు.