అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: అడిషనల్ కలెక్టర్

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: అడిషనల్ కలెక్టర్

ఆదిలాబాద్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలను ఆమె స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.