VIDEO: లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు
KMM: భారీ వర్షానికి ఖమ్మం నగరంలోని 47వ డివిజన్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్థానిక గంగమ్మ తల్లి ఆలయం వద్ద వరద నీరు భారీగా చేరడంతో కేఎంసీ అధికారులు ఆయా ప్రాంతాల ప్రజల ఇళ్లను ఖాళీ చేయించి పునరావాస కేంద్రానికి తరలించారు. ప్రజలకు సంబంధించి విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు ఆటోల ద్వారా పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లారు.