'అటవీ సంరక్షణ కోసం చర్యలు'
CTR: అటవీ సంరక్షణ కోసం చర్యలు చేపట్టినట్లు పుంగనూరు అటవీ క్షేత్రాధికారి శ్రీరాములు గురువారం పేర్కొన్నారు. 2026-7 సంవత్సరానికి గాను రూ.50 లక్షలతో ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. సదుం పరిధిలో 50 హెక్టార్లలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. ఆవులపల్లి, అన్నెమ్మగారిపల్లి, ముత్తుకూరు, సోమల, సదుం పరిధిలో నర్సరీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపమని తెలిపారు.