పోలీస్ స్టేషన్ను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం మధ్యాహ్నం బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, యూనిఫామ్ టర్న్ అవుట్ కిట్ ఆర్టికల్స్ను తనిఖీ చేశారు. బోధన్ ఏసీపీ, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సైలతో సమావేశమై వివిధ రకాల ఫైల్స్ను క్షుణ్ణంగా పరిశీలించారు.