జిల్లాలో ఎస్సై పదోన్నతి పరీక్షలు
కర్నూలు: పోలీసు శిక్షణా కేంద్రంలో ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లకు ఎస్సై పదోన్నతి పరీక్షలు మంగళవారం నిర్వహించారు. రాయలసీమ జోన్కు చెందిన 72 మంది హాజరయ్యారు. ఐపీసీ, సీఆర్పీసీ, సాక్ష్యాధారాల చట్టం, పోలీసు విధానం తదితర అంశాలపై ఇండోర్ పరీక్షలు జరిగాయిని తెలిపారు. బుధవారం ఔట్డోర్ పరీక్షలు ఉంటాయిని పేర్కొన్నారు. నిర్వహణను దీపికా పాటిల్ ఐపీఎస్ పరిశీలించారు.