'మొక్కలను నాటడంతో పాటు వాటిని పరిరక్షించాలి'

NRML: మొక్కలను నాటడమే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యతను విద్యార్థులు తీసుకోవాలని ఎస్సై రాహుల్ గైక్వాడ్ అన్నారు. ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ జడ్పీహెచ్ఎస్లో శుక్రవారం ఆయన వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.