64 మందికి భారీగా జరిమానా, ఇద్దరికి జైలు

64 మందికి భారీగా జరిమానా, ఇద్దరికి జైలు

VZM: విజయనగరం పట్టణంలో జరిగిన డ్రంక్ & డ్రైవ్ తనిఖీల్లో 66 మంది వాహనదారులు పట్టుబడ్డారు. కోర్టు విచారణలో 64 మందికి రూ.10,000 చొప్పున జరిమానా, ఇద్దరికి వరుసగా 2 రోజులు, 5 రోజుల జైలుశిక్షలు విధించాయని ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణ కోసం మద్యం సేవించి వాహనం నడపకూడదని, భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.