'సమతుల్య ఆహారంతో వ్యాధులు దూరం'
KMM: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా బనిగండ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 'ఆశా డే' నిర్వహించారు. వైద్యాధికారులు డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ అశ్విని ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. సమతుల్య ఆహారం, నిత్య వ్యాయామం, సరైన నిద్రతోనే వ్యాధులకు దూరంగా ఉండొచ్చని సూచించారు.