'రైతులను ఆదుకోవాలని కలెక్టర్కు వినతి'

NDL: నంద్యాల జిల్లా కలెక్టర్ రాజా కుమారిని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి శుక్రవారం కలిశారు. ఈ మేరకు యూరియా కొరత రైతాంగాన్ని వెంటాడుతోందన్ని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కాగా, అన్ని మండలాల్లో, రైతు భరోసా కేంద్రాలు, ఎరువుల దుకాణాల్లో రైతన్నకు యూరియా అందడం లేదని, మునుపటిలా ఎక్కడికక్కడ యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు తరుపు కలెక్టర్ను ఆయన కోరారు.