ప్రజావాణిలో 76 ఫిర్యాదులు

ప్రజావాణిలో 76 ఫిర్యాదులు

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ప్రావీణ్య అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 76 మంది తమ సమస్యలను విన్నవించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.