రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ
కృష్ణా: పమిడిముక్కల మండలంలోని మామిళ్ళపల్లి గ్రామంలో రైతులకు 278 కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 19 నెలల కాలంలో రైతుల ప్రగతే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. గత ప్రభుత్వం రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలను ముద్రించిందని విమర్శించారు.