'ఐకేపీ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి'
SRPT: పెన్పహాడ్ మండలం అనాజీపురంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరతో పాటు సన్నరకాలకు రూ.500 బోనస్ పొందాలని సూచించారు. కేంద్రాల్లో తూకం,తేమ యంత్రాలు సిద్ధంగా ఉంచాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని చెప్పారు.