నేడు రోడ్డు షోలో పాల్గొననున్న ముఖ్యనేతలు
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్, BRS ముఖ్య నేతలు ఈరోజు రోడ్ షోలు నిర్వహించనున్నారు. CM రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా సాయంత్రం యూసఫ్ గూడ చెక్ పోస్టు నుంచి కృష్ణాకాంత్ పార్కుకు చేరుకుని ప్రసంగించనున్నారు. షేక్పేట్లో BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR మాగంటి సునీతకు మద్దతుగా షేక్పేట్ నాలా వద్ద ప్రసంగిస్తారు.