'18న మార్కాపురంలో జాబ్ మేళా'
ప్రకాశం: ఏపీ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 18న మార్కాపురం బాలికల ఉన్నత పాఠశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి రవితేజ సోమవారం ప్రకటించారు. ఇందులో భాగంగా పది బహుళ జాతీయ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయి అని, 18-35 ఏళ్ల మధ్య నిరుద్యోగులు ఈ అవకాశం వినియోగించుకోవాలని ఆయన సూచించారు.