పురుగుల మందు తాగి విద్యార్థి ఆత్మహత్య

పురుగుల మందు తాగి విద్యార్థి ఆత్మహత్య

అన్నమయ్య: రామసముద్రం మండలం జక్కనవారిపల్లెకు చెందిన ఇంటర్ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీకి వెళ్లలేదని అతని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.