వైమానిక దళపతి నోట 'పోకిరి' డైలాగ్

ఢిల్లీలో నిర్వహించిన సీఐఐ కార్యక్రమంలో వైమానిక దళపతి ఏపీ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ప్రస్తావించారు. ఆపరేషన్ సమయంలో.. 'ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను' అనే తరహాలో భారత్ ముందుకు సాగిందన్నారు. ఆయన డైలాగ్ విన్న వారంతా ఒక్కసారిగా చప్పట్లతో హోరెత్తించారు. మేడిన్ ఇండియా ఆయుధాల వినియోగానికి సైన్యం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.